వడదెబ్బకు ఏడుగురి మృతి  | Seven people die with sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు ఏడుగురి మృతి 

Apr 17 2018 3:29 AM | Updated on Apr 17 2018 8:52 AM

Seven people die with sunstroke - Sakshi

ఏటూరునాగారం/గార్ల/లింగంపేట: వడదెబ్బకు సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం ఆకులవారి ఘణపురం గ్రామానికి చెందిన గీకురు సారయ్య (65), మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం బుద్దారం తండాకు చెందిన బానోత్‌ తార (45), కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం అయ్యపల్లికి చెందిన పిట్ల నారాయణ, వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఖిలా వరంగల్‌ మండలం జక్కలొద్ది గ్రామ సమీపంలో ఓ యాచకుడు(40), నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండల కేంద్రంలోని సుభాష్‌నగర్‌ కాలనీకి చెందిన కుంచెపు నడిపన్న (47), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి తండాకు చెందిన బానోతు రాములు (35), ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గొల్లగూడెంకు చెందిన కొత్తపల్లి రాఘవులు(45) వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement