దొంగ వాహనాలపై తిరిగిన పోలీసుల సస్పెన్షన్ | seized vehicles used police suspended by hyderabad CP | Sakshi
Sakshi News home page

దొంగ వాహనాలపై తిరిగిన పోలీసుల సస్పెన్షన్

Apr 22 2015 8:11 PM | Updated on Aug 21 2018 5:46 PM

ఇద్దరు సీఐలు,ఒక ఎస్ఐ,ఒక హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్..

హైదరాబాద్: సీజ్ చేసిన వాహనాలను దర్జాగా వాడుకున్న పోలీసులకు చుక్కెదురైంది. వీరి బండారాన్ని బయట పెట్టిన 'సాక్షి' కథనాలకు పోలీసు యంత్రాంగం స్పందించింది.

సీసీఎస్ సీఐలు మధుమమోహన్, ప్రసాద్, ఎస్ఐ శ్రీనివాస్, ఏఎస్ఐ గురునాధం, హెడ్ కానిస్టేబుల్ మోహన్ లను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ కేసుల్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలను సొంత పనుల కోసం వాడుకుంటున్న వైనాన్ని ఫొటోలతో సహా 'సాక్షి' బయటపెట్టిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన కమిషనర్.. ఈ కేసులో పలువురు పోలీసులను సస్పెండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement