'టి.కాంగ్రెస్లో మ్యాచ్ ఫిక్సింగ్ నేతలున్నారు' | Sarve Satyanarayana takes on t congress leaders | Sakshi
Sakshi News home page

'టి.కాంగ్రెస్లో మ్యాచ్ ఫిక్సింగ్ నేతలున్నారు'

Mar 8 2015 6:34 PM | Updated on Sep 2 2017 10:31 PM

'టి.కాంగ్రెస్లో మ్యాచ్ ఫిక్సింగ్ నేతలున్నారు'

'టి.కాంగ్రెస్లో మ్యాచ్ ఫిక్సింగ్ నేతలున్నారు'

టి.కాంగ్రెస్లో మ్యాచ్ ఫిక్సింగ్ నేతలున్నారని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఆరోపించారు.

హైదరాబాద్ : టి.కాంగ్రెస్లో మ్యాచ్ ఫిక్సింగ్ నేతలున్నారని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఆరోపించారు. ఆదివారం గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మల్లు భట్టివిక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పలువురు పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు.  ఈ సందర్బంగా సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ... పొన్నాల వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని ముద్ర పడిందని గుర్తు చేశారు.

పొన్నాలను తొలగించాలని కొందరు నేతలు పార్టీ అధిష్టానానికి చెప్పారని ఆరోపించారు. 2019 నాటి వరకు ఉత్తమ్ నాయకత్వాన్నే కొనసాగించాలని ఈ సందర్బంగా సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ సర్కార్ ఎప్పుడు పడిపోతుందో తెలియదు కాబట్టి పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులకు ఆయన సూచించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన సీనియర్ నేతలు జైపాల్రెడ్డి, డీఎస్లు మాట్లాడుతూ... యువనాయకత్వానికి అధిష్టానం పార్టీ పగ్గాలు అప్పచెప్పిందని సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి ఉత్తమ్, భట్టి విక్రమార్కలకు సహకరించాలని నేతలందరికి జైపాల్రెడ్డి, డీఎస్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement