‘సాగుబడి’ రాంబాబుకు జీవన సాఫల్య పురస్కారం | sagu badi Rambabu wins Lifetime Achievement Award | Sakshi
Sakshi News home page

‘సాగుబడి’ రాంబాబుకు జీవన సాఫల్య పురస్కారం

Dec 22 2019 6:26 AM | Updated on Dec 22 2019 6:26 AM

sagu badi Rambabu wins Lifetime Achievement Award - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘సాక్షి సాగుబడి’డెస్క్‌ ఇన్‌చార్జ్, సీనియర్‌ న్యూస్‌ ఎడిటర్‌ పంతంగి రాంబాబుకు 2019 సంవత్సరానికి గాను ప్రతి ఏటా రైతు దినోత్సవం సందర్భంగా కర్షక సాధికార సంఘటన (కేఎస్‌ఎస్‌) అందించే మాజీ ప్రధాని చౌదరి చరణ్‌ సింగ్‌ జీవన సాఫల్య పురస్కారం లభించింది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో విశిష్ట సేవలందించిన తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు రైతులు, పాత్రికేయులు, శాస్త్రవేత్తలకు కె.ఎస్‌.ఎస్‌ ఈ పురస్కారాలను అందిస్తోంది.

పంతంగితో పాటుగా పసుపు విత్తన రైతు పిడికిటి చంద్రశేఖర ఆజాద్‌ (తెలంగాణ), ప్రకృతి వ్యవసాయ మహిళా రైతు అన్నే పద్మావతి (నూజివీడు), టీ న్యూస్‌ చేను–చెలక ఎడిటర్‌ విద్యాసాగర్, సైంటిస్ట్‌ డా.సురేంద్రరాజులకు ఈ అవార్డు లభించింది. ఈమేరకు కేఎస్‌ఎస్‌ అధ్యక్షుడు మారం కరుణాకరరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెలది పురుషోత్తంరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న రాజేంద్రనగర్‌లోని ‘వాలంతరి’లో జరిగే సభలో తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement