ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ


కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని ఓ ఆలయంలో చోరీ జరిగింది. మండలంలోని విశ్వనాథపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలోకి ఆదివారం అర్ధరాత్రి  దొంగలు చొరబడి హుండీతోపాటు స్వామివారి కడియాలు ఇతర విలువైన వస్తువులు దోచుకెళ్లారు. ఈ విషయం సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top