రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Published Sun, Jul 2 2017 9:33 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి - Sakshi

రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల క్రాస్‌ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓవ్యక్తి దుర్మరణం చెందాడు. నేరెళ్లకు చెందిన భూమయ్య(55) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఇసుక లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో భూమయ్య తల నేలకు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనతో జిల్లెల్ల క్రాస్ రోడ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రెండు లారీలకు నిప్పు పెట్టి మరో లారీపై దాడిచేశారు. అడ్డుకోబోయిన పోలీసులపై తిరగబడ్డారు. ఇసుక లారీలను పోలీసులు ఎక్కడికక్కడే నిలిపివేసి భారీగా మోహరించారు. సంఘటనా స్థలానికి ఎస్పీ విశ్వజిత్‌ చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Advertisement
Advertisement