రేవంత్రెడ్డిది బ్లాక్మెయిల్ నైజం: బాల్క సుమన్ | revanth reddy used to blackmail all, says mp balka suman | Sakshi
Sakshi News home page

రేవంత్రెడ్డిది బ్లాక్మెయిల్ నైజం: బాల్క సుమన్

Sep 22 2014 2:53 PM | Updated on Sep 2 2017 1:48 PM

రేవంత్రెడ్డిది బ్లాక్మెయిల్ నైజం: బాల్క సుమన్

రేవంత్రెడ్డిది బ్లాక్మెయిల్ నైజం: బాల్క సుమన్

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిది బ్లాక్ మెయిల్ చేసే నైజమని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు.

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిది బ్లాక్ మెయిల్ చేసే నైజమని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులతో కూడా రేవంత్ రెడ్డి టచ్లో ఉన్నారని ఆయన చెప్పారు. ఆయన పదే పదే విలేకరుల సమావేశాలు ఏర్పాటుచేసి పారిశ్రామికవేత్తలను బ్లాక్మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు.

మెట్రోరైలు కోసం కేటాయించిన భూములను 'మైహోం' రామేశ్వర్ రావుకు కేటాయించారంటూ రేవంత్ రెడ్డి ఆరోపించడం, దానిపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగడం తెలిసిందే. తాజాగా తెలంగాణ టీడీపీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారన్న కథనాలు రావడం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement