స్థలాలు చూపిస్తే రైతు బజార్లు: హరీశ్‌ | raythu bazaars show places | Sakshi
Sakshi News home page

స్థలాలు చూపిస్తే రైతు బజార్లు: హరీశ్‌

Nov 16 2017 5:24 AM | Updated on Nov 16 2017 5:24 AM

raythu bazaars show places - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజధాని నగరంలో ప్రస్తుతం 48 ప్రాంతాల్లో మొబైల్‌ రైతు బజార్లను ఏర్పాటు చేసి తక్కువ ధరకు కూరగాయాలు విక్రయిస్తున్నామని మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. త్వరలో మరో 52 ప్రాంతాలకు ఈ సేవలను విస్తరింపజేస్తామని చెప్పారు. రహదారులకు సమీపంలో స్థలాలను సమీకరించి ఇస్తే రైతు బజార్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మండలిలో సభ్యుల ప్రశ్నలకు బదులిచ్చారు. కృష్ణా ట్రిబ్యునల్‌ ముందు కాంగ్రెస్‌ పాలకులు రాష్ట్రానికి అనుకూలం గా వాదనలు వినిపించకుండా అన్యాయం చేశారని, ఈ నష్టాన్ని పూడ్చేందుకు ట్రిబ్యునల్‌తోపాటు సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నామన్నారు.ట్రిబ్యునల్‌ ముందు రాష్ట్రం తరఫున వాదనలు వినిపించడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్ష నేత షబ్బీర్‌ అలీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్‌  స్వామిగౌడ్‌ తిరస్కరించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement