సికింద్రాబాద్ స్టేషన్‌లో 90 కేజీల గంజాయి స్వాధీనం | police arrest two people with 90 kgs opium in secunderabad railway station | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్ స్టేషన్‌లో 90 కేజీల గంజాయి స్వాధీనం

Feb 7 2015 11:28 PM | Updated on Sep 2 2017 8:57 PM

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 90 కేజీల గంజాయిని రైల్వే పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు.

సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 90 కేజీల గంజాయిని రైల్వే పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరిని అరెస్ట్ చేశారు. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన సంతోష్ హెచ్ పాత్రో(24), బల్లు(23)ల బ్యాగులను పోలీసులు స్కానర్లతో తనిఖీ చేస్తుండగా విషయం బయటపడింది. 90 కేజీల గంజాయితో పాటు, వారి వద్ద నుంచి రూ.40 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement