రైలు బోగీ ఎక్కి ఫోటో దిగేందుకు యత్నం, గాయాలు | one injured by electric shock in bb nagar railway station | Sakshi
Sakshi News home page

రైలు బోగీ ఎక్కి ఫోటో దిగేందుకు యత్నం, గాయాలు

Jan 3 2015 1:17 PM | Updated on Sep 5 2018 2:26 PM

నల్లగొండ జిల్లా బీబీనగర్ రైల్వేస్టేషన్లో ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించి తీవ్రంగా గాయపడ్డాడు.

నల్లగొండ: నల్లగొండ జిల్లా బీబీనగర్ రైల్వేస్టేషన్లో ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించి తీవ్రంగా గాయపడ్డాడు. గుంటూరుకు చెందిన రవి అనే యువకుడు శనివారం డెల్టా ప్యాసింజర్ రైలు బోగీ ఎక్కి ఫోటో దిగేందుకు యత్నించాడు. ఈ నేపథ్యంలో పైనున్న కరెంట్ తీగలు తగలటంతో అతను విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన రవిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement