చెట్టును ఢీకొన్న కారు: వ్యక్తి మృతి | One dies in road accident | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న కారు: వ్యక్తి మృతి

Oct 25 2015 10:45 AM | Updated on Aug 30 2018 3:56 PM

వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది.

లక్సెట్టిపేట (ఆదిలాబాద్) : వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం శాంతాపూర్ గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో గుడిపేట గ్రామానికి చెందిన అశోక్ కుమార్(28) మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement