కల్తీ కల్లు దొరక్క వ్యక్తి మరణం | one died due to Adulterated liquor | Sakshi
Sakshi News home page

కల్తీ కల్లు దొరక్క వ్యక్తి మరణం

Nov 22 2015 4:13 PM | Updated on Mar 28 2018 11:11 AM

హైదరాబాద్ శివార్లలో కల్తీ కల్లు లభించకపోవడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు.

రంగారెడ్డి జిల్లా:  హైదరాబాద్ శివార్లలో కల్తీ కల్లు లభించకపోవడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

కర్ణాటకకు చెందిన చిలకల సురేష్(35) గత ఐదేళ్లుగా చిలక జోస్యం చెప్పుకుంటూ ధారూర్‌లోనే నివాసముంటున్నాడు. ఈ క్రమంలో కల్తీ కల్లుకు బానిసయ్యాడు. కొంతకాలంగా కల్తీకల్లు దొరక్కపోవడంతో..తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సురేష్  మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement