సెల్‌చార్జింగ్ పెడుతూ షాక్‌తో ఒకరి మృతి | One died by shot curcuit during charing his cell | Sakshi
Sakshi News home page

సెల్‌చార్జింగ్ పెడుతూ షాక్‌తో ఒకరి మృతి

Feb 27 2015 11:46 PM | Updated on Nov 9 2018 4:36 PM

వరంగల్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు శివారు పడమటి తండాలో శుక్రవారం సెల్‌చార్జింగ్ పెడుతూ ఓ విద్యార్థి..

వరంగల్ (గూడూరు) : వరంగల్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు శివారు పడమటి తండాలో శుక్రవారం సెల్‌చార్జింగ్ పెడుతూ ఓ విద్యార్థి మృతి చెందాడు. తేజావత్ షేట్యా, బుజ్జి మూడో కుమారుడు విజయ్(16) అయోధ్యపురం పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఉదయం ఇంట్లో సెల్ చార్జింగ్ పెట్టే క్రమంలో విద్యుదాఘాతానికి గురై పడిపోయూడు. కుటుంబ సభ్యులు గూడూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement