తూతూమంత్రంగా ఈఎన్‌సీల భేటీ | no serious discussion in enc meeting on water disputes | Sakshi
Sakshi News home page

తూతూమంత్రంగా ఈఎన్‌సీల భేటీ

Feb 3 2015 1:45 AM | Updated on Sep 2 2017 8:41 PM

కృష్ణా నదీ జలాల వివాదం పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ)ల మధ్య జరిగిన సమావేశం తూతూమంత్రంగా జరిగింది.

హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదం పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ)ల మధ్య జరిగిన సమావేశం తూతూమంత్రంగా జరిగింది. కేవలం పది నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎవరి అవసరాలను వారు మరోమారు చర్చకు తేవడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేశారు.

సాగర్ జలాల వినియోగంపై చర్చించేందుకు సోమవారం తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు భేటీ అయ్యారు. రాత్రి 7 గంటల సమయంలో ఏపీ ఈఎన్‌సీ తెలంగాణ ఈఎన్‌సీ కార్యాలయానికి వెళ్లారు. అప్పటికే అధికారులంతా కార్యాలయం నుంచి వెళ్లిపోవడంతో మంగళవారం మరోసారి భేటీ కావాలని ఇద్దరు అధికారులు నిర్ణయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement