పెళ్లయిన వారం రోజులకే ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
యాకుత్పురా: పెళ్లయిన వారం రోజులకే ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మొఘల్పురా పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం... లాల్దర్వాజా మోడ్ నాగులచింత ఆర్య మైదాన్ ప్రాంతానికి చెందిన పోలీసు శాఖ మాజీ ఉద్యోగి మోహన్ జాదవ్, శోభ దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక అబ్బాయి ఉన్నారు. కాగా చిన్నమ్మాయి జ్యోతిరాణి (24) వివాహం గత నెల 26వ తేదీన అత్తాపూర్ ప్రాంతానికి చెందిన కృష్ణ (26)తో జరిపించారు.
ఈ నెల 2న నాగులచింత తల్లిగారింట్లో ఉన్న నవ దంపతులు, బంధువులతో కలిసి బల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మధ్యాహ్నం సమయంలో జ్యోతిరాణి బట్టలు మార్చుకు వస్తానని గదిలోకి వెళ్లింది. అనంతరం తిరిగి బయటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్కు ఉరేసుకుని విగతజీవిగా కనిపించింది. దీనిపై అనుమానాస్పద ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.