సీఎం పేషీలో కొత్తగా 74 పోస్టులు | New 74 posts announced by Telangana government over CM office | Sakshi
Sakshi News home page

సీఎం పేషీలో కొత్తగా 74 పోస్టులు

Aug 9 2014 3:22 AM | Updated on Aug 15 2018 9:22 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పేషీలో కొత్తగా 74 పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పేషీలో కొత్తగా  74 పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సీఎంకు ఓఎస్‌డితో పాటు స్పెషల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర అధికారులకు అసిస్టెంట్ సెక్రటరీలు, జిరాక్స్ ఆపరేటర్లు, డ్రైవర్లు, అటెండర్లు తదితర పోస్టులు మంజూరైన వాటిలో ఉన్నాయి. ఇందులో కొన్నింటిని తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement