నల్లగొండ టూ టౌన్ : నల్లగొండ మున్సిపాలిటీలో జరిగిన ఆస్తిపన్ను కుంభకోణంపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. మున్సిపాలిటీలో 2011 నుంచి 2015 మధ్య వసూలుచేసిన ఆస్తిపన్ను డబ్బులు మున్సిపల్ కార్యాలయంలో జమ చేయకుండా స్వాహ చేసిన ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయాలని ప్రభుత్వం మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు మున్సిపల్ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు తెలిసింది. 2011 నుంచి 2015 మార్చి నెలాఖరు వరకు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అన్ని రకాల రికార్డులు, పన్ను వసూలు, ఖర్చు, రశీదు బక్కులు, చెక్కు బుక్కులు తదితర వాటిపై స్పెషల్ ఆడిట్ బృందం చేస్తున్న విచారణ ముగింపు దశకు చేరింది.
ఇటీవల ఏజీ ఆడిట్ అధికారుల బృందం కూడా వారం రోజులు విచారణ జరిపి పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఒక్క రెవెన్యూ విభాగంలోనే ఆస్థి పన్నుకు సంబంధించిన విషయంలో 3.32 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు వెలుగుచూసింది. దీంతో 2011 సంవత్సరం నుంచి ఎంతమంది ఉద్యోగులకు ఈ కుంభకోణంలో భాగస్వామ్యం ఉందన్న దానిపై పూర్తి విచారణ జరిపినట్లు సమాచారం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నలుగురు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఒక యూడీఆర్ఐకి, 17మంది బిల్ కలెక్టర్లకు అక్రమాలలో పాత్ర ఉన్నట్లు వెల్లడైంది. దీంతో వీరిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులపై కొరఢా ఝులిపించి వేటు వేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
ఇప్పటికే సస్పెండ్ అయిన ఇద్దరు ఉద్యోగులు..
మున్సిపాలిటీ కార్యాలయంలో ఆస్తిపన్ను కాజేసిన వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులను రెండు నెలల క్రితమే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అకౌంట్ విభాగంలో ఉన్న రశీదు బుక్కులు దొంగతనానికి గురయ్యాయి. మున్సిపాలిటీ కార్యాలయంలో దొంగతనం జరగడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడంతో కలెక్టర్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించింది. ఇదే విషయంలో ఇప్పటికే ఐదుగురి ఉద్యోగులపై మున్సిపల్ కమిషనర్ నల్లగొండ టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ కొనసాగుతుంది. ఇంకా చోరీకి గురైన ఆస్తిపన్నుకు సంబంధించిన రశీదు బుక్కులు దొరకాల్సి ఉంది. ఆ బుక్కులు దొరికితే అవినీతి మరికొంత పెరిగే అవకాశం ఉంది.
మున్సిపల్ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
Published Thu, Jul 23 2015 11:06 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement