'మోదీ సర్కారుకు అన్ని వర్గాల్లో ఆదరణ' | Modi government is popular in all categories: Laxman | Sakshi
Sakshi News home page

'మోదీ సర్కారుకు అన్ని వర్గాల్లో ఆదరణ'

May 27 2016 2:05 AM | Updated on Mar 29 2019 9:31 PM

రెండేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దేశప్రజలకు విశ్వాసం పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు.

పార్టీ కార్యాలయంలో వేడుకలు


హైదరాబాద్: రెండేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దేశప్రజలకు విశ్వాసం పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, శాసనసభ్యులు జి.కిషన్‌రెడ్డి, ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, పార్టీ జాతీయ నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, నేతలు చింతా సాంబ మూర్తి, ప్రేమేందర్‌రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, కె.సత్యనారాయణ, రిటైర్డు డీజీపీ దినేశ్‌రెడ్డి, రాష్ట్ర పదాధికారులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ అభివృద్ధి పథంలో భారత్ అనే కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు, మారుమూల ప్రాంతాలకు తీసుకుపోవాలని  సూచించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement