లోకోపైలట్‌ చంద్రశేఖర్‌ కుడికాలు తొలగింపు 

MMTS Loco Pilot Chandrashekar Right Leg Has Removed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నాంపల్లి కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లోకోపైలట్‌ చంద్రశేఖర్‌ (35) కుడికాలు ను గురువారం తొలగించారు. ప్రమాదంలో చంద్రశేఖర్‌ తీవ్రంగా గాయపడటంతో ఆయన కుడి కాలు చిధ్రమైంది. రక్తనాళాలతో పాటు కండరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ భాగానికి రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోవడం, కిడ్నీ, గుండెకు ఇన్‌ఫెక్షన్‌ చేరే ప్రమాదం ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో కుడిమోకాలి పైభాగం వరకు కాలును తొలగించాల్సి వచ్చిందని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. ఇక ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బౌద్ధ నగర్‌కు చెందిన లెక్చరర్‌ శేఖర్‌(36)తో పాటు మరో నలుగురికి వివిధ రకాల చికిత్సలందిస్తున్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top