ఎమ్మెల్యే సండ్ర వీరయ్యకు 14 రోజుల రిమాండ్ | mla sandra venkata veeraiah remanded in 14 days judicial custody | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే సండ్ర వీరయ్యకు 14 రోజుల రిమాండ్

Jul 7 2015 2:06 PM | Updated on Sep 3 2017 5:04 AM

టుకు కోట్లు కేసులో అయిదో నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టు 14 రోజులపాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో అయిదో నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టు 14 రోజులపాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆయనకు ఈనెల 21 వరకూ రిమాండ్ విధించటంతో అధికారులు చర్లపల్లి జైలుకు తరలిస్తున్నారు. మరోవైపు సండ్ర కస్టడీతో పాటు, బెయిల్ పిటిషన్లు బుధవారం విచారణకు రానున్నాయి. ఎమ్మెల్యే అయినందున సండ్రను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement