'నాణ్యత లేకపోతే క్రిమినల్ కేసులు' | mla babumohan starrts mission kakateeya works in medak | Sakshi
Sakshi News home page

'నాణ్యత లేకపోతే క్రిమినల్ కేసులు'

May 17 2016 5:20 PM | Updated on Aug 16 2018 4:36 PM

మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత పాటించని కాంట్రాక్టర్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎమ్మెల్యే బాబూ మోహన్ హెచ్చరించారు.

పుల్కల్: మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత పాటించని కాంట్రాక్టర్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎమ్మెల్యే బాబూ మోహన్ హెచ్చరించారు. మంగళవారం మెదక్ జిల్లా పుల్కల్ మండలం చక్రియాల్‌లో మిషన్ కాకతీయ పనులను అయన ప్రారంభించారు. కామని చెరువుకు రూ.27 లక్షలు, నల్లకుంటకు రూ.23 లక్షలతో పూడికతీత పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు లాభాల కోసం కాకుండా సేవాభావంతో పనులు చేయాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement