-
ఆహ్లాదం.. వేగిరం
నీటివనరుల పరిరక్షణ, మత్స్య సంపద పెంపు, వ్యవసాయానికి భరోసాతోపాటు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద చేపట్టిన మినీ ట్యాంక్బండ్ల నిర్మాణాలు జిల్లాలో పూర్తికావొచ్చాయి. సివిల్ వర్క్స్ పూర్తి కాగా.. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తుదిమెరుగులు దిద్దనున్నారు. మరో నెల, రెండు నెలల్లో అంటే వర్షాకాలంలో మెతుకు సీమ ఆహ్లాదసీమగా మారనుంది. దీంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, మెదక్ : మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2015లో ప్రతిష్టాత్మకంగా మినీ ట్యాంక్బండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున అందుబాటులో ఉన్న పెద్ద చెరువులను ఎంపిక చేసి.. విడతల వారీగా అభివృద్ధి చేయాలని సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా కేంద్రం, మెదక్ నియోజకవర్గ పరిధిలోని పిట్లం, గోసముద్రం మినీ ట్యాంక్బండ్ పనులు తుది దశలో కొనసాగుతున్నాయి. దీంతోపాటు నర్సాపూర్లోని రాయరావు చెరువు బ్యూటిఫికేషన్ సైతం పూర్తయింది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రత్యేక శోభను సంతరించుకోనుంది. సకాలంలో వర్షాలు కురిస్తే... జూన్ లేదా జూలై నుంచి ప్రతి రోజూ ‘మినీ’జాతరేనని అధికారులు భావిస్తున్నారు. పిట్లం, గోసముద్రం కలిపి.. మెదక్ పట్టణ సమీపంలోని పిట్లం, గోసముద్రం చెరువులు రెండింటినీ కలిపి మినీ ట్యాంక్బండ్గా అభివృద్ధి చేసేందుకు 2016లో అనుమతులు వచ్చాయి. ఈ మేరకు రూ.9.52 కోట్లు మంజూరు కాగా.. మిషన్ కాకతీయ పథకంలో సివిల్ వర్క్స్ చేపట్టారు. ఈ పనులు తుది దశలో ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు రూ.7 కోట్ల వ్యయమైనట్లు అధికారులు చెబుతున్నారు. కట్టల బలోపేతం, వెడల్పు, జంక్షన్ పాయింట్ల నిర్మాణాలు చేశారు. కట్టపైన రెయిలింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ లెక్కన సివిల్ వర్క్స్ పూర్తయినట్లే. ఆ తర్వాత పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గ్రీనరీ, అలంకరణ, వసతుల కల్పన వంటి పనులు చేపట్టాల్సి ఉంది. ఇది పూర్తయితే పిట్లం, గోసముద్రం మినీ ట్యాంక్ బండ్ అందుబాటులోకి వచ్చినట్లే. మల్లెచెరువుకు మహర్దశ మరోవైపు మెదక్ నియోజకవర్గంలోని రామాయంపేటలో ఉన్న మల్లెచెరువును సైతం మినీట్యాంక్బండ్గా మార్చేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మొదటి దఫాలో రూ.3 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు కాగా.. పనులు గత నెలలో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కట్టపై బ్రిడ్జి నిర్మాణంతోపాటు కట్ట వెడల్పు పనులు కొనసాగుతున్నాయి. ఇది కూడా నెల, రెండు నెలల్లో పూర్తి కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తయితే పట్టణ ప్రజలకు ప్రధానంగా మురికి నీటి సమస్య తొలగడంతోపాటు ఆహ్లాదకర వాతావరణం అందుబాటులోకి రానుంది. ‘రాయరావు’ అందం చూడతరమా.. నర్సాపూర్ నియోజకవర్గంలోని రాయరావు చెరువు బ్యూటిఫికేషన్కు తొలివిడతగా రూ.2.90 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో చెరువు కట్ట బలోపేతం, పంట కాల్వల నిర్మాణంతోపాటు బతుకమ్మ పండుగకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు నర్సాపూర్కు చెందిన జెడ్పీ చైర్పర్సన్ రాజమణిమురళీధర్ యాదవ్ దంపతులు తమ కుమారుడు అజయ్ యాదవ్ స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో చెరువు కట్టపై పలు అభివృద్ధి పనులు చేపట్టారు. పట్టణ పరిధిలోని బీవీ రాజు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యం సహకారంతో కట్టపై విద్యుద్దీకరణ, వాకింగ్ ట్రాక్, కట్టపై గ్రిల్స్ ఏర్పాటు, మొక్కలు నాటడం, బెంచీల ఏర్పాటు, ఓపెన్ జిమ్ పరికరాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రాయరావు చెరువు బ్యూటిఫికేషన్ పూర్తి కాగా.. మినీ ట్యాంక్బండ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదించే యోచనలో ఉన్నారు. కౌడిపల్లి చెరువు.. నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లిలోని పెద్దచెరువును సైతం మినీట్యాంక్ బండ్గా మార్చే పనులు సాగుతున్నాయి. గతంలోనే రూ.4 కోట్లు మంజూరు కాగా.. కట్ట బలోపేతం వంటి తదితర పనులు చేపట్టారు. కట్టపై సీసీ రోడ్డు నిర్మాణం తదితర పనులు అలాగే ఉన్నాయి. ఇది మిషన్ కాకతీయ పథకంలో లేనందున నిధుల లేమి సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది. దీని కోసం నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. తూప్రాన్ పెద్దచెరువు.. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న తూప్రాన్ మండలం జిల్లాల విభజనలో మెదక్లో చేరింది. ఇక్కడ పెద్దచెరువును మినీట్యాంక్బండ్గా మార్చాలని సంకల్పించారు. రూ.7 కోట్ల వ్యయంతో బ్యూటిఫికేషన్ పనులు చేపట్టారు. పనులు దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. తాజాగా.. మినీట్యాంక్ బండ్గా మార్చేందుకు రూ.4 కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. నిధులు విడుదల కాగానే.. మిగిలిన పనులు పూర్తిచేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
‘పెండింగ్ ’ పరుగులు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఏ క్షణమైనా ప్రభుత్వ రద్దు నిర్ణయం వెలువడనుందన్న సమాచారం నేప థ్యంలో.. నీటి పారుదల శాఖలో పెండింగ్ ఫైళ్లకు అనుమతులు దక్కించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. తమ నియోజకవర్గంలోని పనులను ఆ మోదించాలని ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో అధికారులు ఫైళ్ల దుమ్ముదులిపారు. బుధవారం ఒక్కరోజే నీటి పారుదల శాఖలో ఏకంగా రూ.7,829 కోట్ల విలువైన పనులను కేబినెట్లో పెట్టి ఆమోదించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరాయి. ఇందులో ఆరు ఎత్తిపోతల పథకాల ప్రతిపాదనలు ఉన్నాయి. ఆరు ఎత్తిపోతల పథకాలు.. గురువారం ప్రభుత్వ రద్దు ఖాయమనే ప్రచారం మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెండింగ్ పనులన్నీ క్లియర్ చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వంలోని పెద్దల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు సమాచారం అందింది. ఇక ఆయా శాఖల పరిధిలో ఉన్న పెండింగ్ ఫైళ్లను తక్షణమే ప్రభుత్వానికి పంపాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు నీటి పారుదల శాఖపై ఒత్తిడి తెచ్చి ఫైళ్లను ప్రభుత్వానికి పంపేలా చేశారు. నల్లగొండ జిల్లాలోని అయిటిపాముల ఎత్తిపోతల పథకాన్ని ఆమోదించాలని ఎమ్మెల్యే వేముల వీరేశం కోరగా.. అధికారులు రూ.111 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. మరో ఎమ్మెల్యే భాస్కర్రావు ఒత్తిడి మేరకు బొత్తలపాలెం–వాడపల్లి ఎత్తిపోతలను రూ.241 కోట్లు, కేశవపురం–కొండ్రపోల్ ఎత్తిపోతలకు రూ.77.25 కోట్లు, దున్నపోతుల గండి ఎత్తిపోతలకు రూ.249 కోట్లతో ప్రతిపాదనలను అధికారులు కేబినెట్ ఆమోదం కోసం పంపారు. కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్ కాల్వలపై జకోరా, చండూరు ఎత్తిపోతలకు మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రతిపాదించారు. జకోరాను రూ.40 కోట్లు, చండూరును రూ.22.94 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపారు. ఇదే జిల్లాలో రూ.476 కోట్లతో జూకల్ నియోజకవర్గంలో మంజీరా ఎత్తిపోతలకు మంగళవారమే ప్రభుత్వం అనుమతించింది. 47 రిజర్వాయర్లు.. రూ.4,179 కోట్లు గద్వాల నియోజకవర్గంలో గట్టు ఎత్తిపోతల పథకంలో 4 టీఎంసీల సామర్ధ్యంతో పెంచికల్ పహాడ్ రిజర్వాయర్ నిర్మించాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో రూ.1,597 కోట్ల కొత్త అంచనాతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి. దీంతో పాటే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో కొత్తగా 47 ఆన్లైన్, ఆఫ్లైన్ రిజర్వాయర్లను 16.11 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని ప్రతిపాదనలు రాగా, వీటికి ఏకంగా రూ.4,179 కోట్లతో అంచనా వేశారు. ఇందులో ఏకంగా కాల్వల నిర్మాణానికే రూ.1,276 కోట్లు ప్రతిపాదించగా, వీటికి కేబినెట్ ఆమోదం రావాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దిగువన పూర్వ మెదక్ జిల్లాలో 1.26 లక్షల ఎకరాలకు ఆయకట్టునిచ్చే సంగారెడ్డి కెనాల్ వ్యవస్థ కోసం వేసిన అంచనాలు కేబినెట్ ఆమోదం కోసం పంపారు. రూ.1,326.34 కోట్లతో అంచనాలు సిద్ధం చేయగా, వీటిని కేబినెట్ ఆమోదిస్తే, మూడు రీచ్లుగా విడగొట్టి పనులకు టెండర్లు పిలిచేందుకు నీటి పారుదల శాఖ సమాయత్తమైంది. ఈ పనులకు సంబంధించి గురువారం నాటి కేబినెట్ భేటీలో చర్చ జరిగితే.. ఆమోదం లాంఛనమే అని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. పలు ఎత్తిపోతల పథకాలకు నిధులు బుధవారం రాత్రి పలు ఎత్తిపోతల పథకాలు, వాటి పరిధిలోని పనులకు సంబంధించి జీవోలు వెలువడ్డాయి. వనపర్తి జిల్లాలో చిన్నబావి మండల పరిధిలో గోప్లాపూర్ ఎత్తిపోతల పథకం పనుల మరమ్మతులకు ప్రభుత్వం రూ.1.17 కోట్లు కేటాయించింది. ఇదే మండల పరిధిలోని చిన్నమారూర్ ఎత్తిపోతల పథకం మరమ్మతులకు రూ.6.47 కో ట్లు కేటాయించింది. నిర్మల్ జిల్లా పరిధిలో వెంకటాపూర్ ఎత్తిపోతల పథకం పరిధిలో అదనపు పనులు చేపట్టేందుకు వీలుగా రూ.62.50 లక్షలు కేటాయించింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామ పరిధిలోని పెద్దచెరువు పునరుద్ధరణకు రూ.2.36 కోట్లు కేటాయిస్తూ మరో ఉత్తర్వు ఇచ్చా రు. నాలుగో విడత మిషన్ కాకతీయలో భాగంగా దుర్గం చెరువు రూ.40.25 కోట్లు, మల్క చెరువు రూ.6.68 కోట్లు, నల్లగండ్ల చెరువు రూ.15.49 కోట్లు కలిపి మొత్తంగా రూ.62.54 కోట్లతో సవరించిన అంచనాలకు అనుమతులు ఇచ్చారు. -
నాలుగో విడత ‘మిషన్’కు రెడీ
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : మిషన్ కాకతీయ నాలుగోవిడత పనులను చేపట్టేందుకు సిద్ధం కావాలని నీటిపారుదలశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం సర్వేలు చేసి అధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగోవిడత కింద 641 చెరువులు, కుంటల మరమ్మతు, పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో అధికారులు నాలుగోవిడత మిషన్ కాకతీయ పనులు ప్రారంభించడంలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయ పనులు ఉమ్మడి జిల్లాలో మూడు విడతలుగా సాగాయి. జిల్లాల పునర్విభజనకు ముందు 5,998 చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇందులో సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్అర్బన్ జిల్లాలకు వెళ్లినవి మినహాయించగా, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో 4,445 మిగిలాయి. ఇందులో నుంచి మూడువిడతల్లో 2171 చెరువుల మరమ్మతు, పునరుద్ధరణ పనులు చేపట్టారు. నాలుగో విడతగా 641 చెరువుల పునరుద్ధరణ, మరమ్మతు పనులకు ప్రభుత్వం ఆమోదం తెలపగా.. ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వేగం పెంచితేనే లక్ష్యం నెరవేరేది.. అగ్రిమెంట్ సమయంలోనే కాంట్రాక్టర్ల కట్టడి.. 2014లో చెరువులు, కుంటల మరమ్మతు, పునరుద్ధరణ పనులకు శ్రీకారం జరగగా.. అదే ఏడాదిలో అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాల పునర్విభజన తర్వాత నాలుగు జిల్లాల్లో 4,445 చెరువులు, కుంటలు మిగలగా.. మొదటి, రెండు, మూడు విడతల్లో 2,171 చెరువుల పనులకు టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లను ఎంపిక చేశారు. ఈ పనుల కోసం రూ.795.95 కోట్లు అంచనావేశారు. మొదటి విడతలో 643 చెరువులకుగాను 631 పనులు పూర్తయ్యాయి. రెండోవిడతలో 863 చెరువులకు ఆమోదం లభించగా.. 859 చెరువుల పనులు ప్రారంభించారు. ఇందులో 581 చెరువులు పూర్తయ్యాయి. మూడో విడతలో 664 చెరువులకు ఆమోదం లభించగా, 654 చెరువులకు టెండర్లు పిలిచి 649 పనులను మొదలుపెట్టారు. మొత్తం మూడు విడతల్లో 2171 చెరువులకు 1212 చెరువులు పూర్తి కాగా, 959 పనులు వివిధస్థాయిల్లో ఉన్నాయి. ఈ పనులపై అధికారులు కాంట్రాక్టర్లకు రూ.213.95 కోట్లు చెల్లించినట్లు రికార్డులు చెప్తున్నాయి. వివిధ స్థాయిల్లో ఉన్న 959 పనులతోపాటు నాలుగో విడతలో 641 చెరువుల పనులు నిర్ణీత సమయంలో పూర్తి కావాలంటే పర్యవేక్షణ, వేగం పెంచడంతో పాటు అగ్రిమెంట్ సమయంలోనే కాంట్రాక్టర్లను కట్టడి చేయాలని పలువురు సూచిస్తున్నారు. పనులపై ఆదినుంచీ ఆరోపణలే మిషన్ కాకతీయ పథకం ప్రారంభం నుంచి చాలాచోట్ల పనులు జరుగుతున్న తీరుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూము, కాలువలు, అలుగు, కట్ట నిర్మాణాల్లో నాణ్యత లోపించిందన్న ఫిర్యాదులు పలు గ్రామాల నుంచి వచ్చాయి. అధికార పార్టీ నేతలు తమ అనుయాయులకే టెండర్లను కట్టబెట్టడం వల్ల పనులు ఎలా చేసినా వారిపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపించాయి. వీటిలో కొన్నింటిపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు విచారణ కూడా జరిపారు. కరీంనగర్, జగిత్యాల డివిజన్లలో చాలాచోట్ల పనుల్లో నాణ్యత లేదని, నామమాత్రంగానే మట్టితరలింపు చేపట్టి బిల్లులు పొందారని తేలింది. కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య సమన్వయంతో ఈ అవినీతి జరిగిందన్న విమర్శలు కూడా వచ్చాయి. చెరువులకు సంబంధించిన తూములు, అలుగుల నిర్మాణంలో నాణ్యత సరిగా ఉండడం లేదు. చెరువు కట్టలు ఎత్తు పెంచడంలో మొరం నింపుతూ పనులు ముగించారన్న ఫిర్యాదులున్నాయి. కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు పనులను ఇతరులకు అప్పగించి తప్పించుకున్న సంఘటనలూ ఉన్నాయి. పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వచ్చిన ఆరోపణలపైనా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అప్పట్లో విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం సక్సెస్ కోసం అధికారులు అవినీతి, అక్రమాలకు తావు లేకుండా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. -
మిషన్ కాకతీయకు బ్రేక్
మూడో దశ అమలు సందేహం నీళ్లతో నిండిన చెరువులు .. పనులు చేయలేని పరిస్థితి నిధులకూ కొరత.. మార్చి తర్వాతే స్పష్టత సాక్షి, వరంగల్ : చిన్న నీటి వనరుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ మూడో దశ అమలు సందేహంగా మారింది. భారీ వర్షాలతో దాదాపు అన్ని చెరువుల్లో నిండా నీళ్లు చేరాయి. వచ్చే వానాకాలం వర కు ఇదే పరిస్థితి ఉండనుంది. చెరువు అభివృద్ధి పనులు చేసేందుకు డిసెంబర్ నుంచి మే వరకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అన్ని చెరువుల్లోనూ నీళ్లు ఉండడంతో మూడో దశ పనులు చేపట్టే పరిస్థితి లేదని సాగునీటి శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. చెరువులు నిండుకుండల్లా ఉండడంతో పూడికతీతలు చేపట్టలేని పరిస్థితులున్నాయి. దీంతో అధికారులు చెరువులకు వచ్చే ఫీడర్ చానళ్ల పనులు చేపట్టనున్నారు. వరద నీరు చెరువుల్లోకి వచ్చే విధంగా ఫీడర్ చానళ్లను పునరుద్ధరించే పనులపై దృష్టిసారించనున్నారు. మిషన్ కాకతీయ మొదటి, రెండో దశ టెండర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో పనుల్లోనూ జాప్యం జరిగింది. ఈ పరిస్థితిని నివారించేందుకు మూడో దశ పనులను పకడ్బందీ గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబరులోపే చెరువుల అభివృద్ధికి సంబంధించిన టెండర్లు పూర్తి చేయాలని ఆదేశించిం ది. అయితే, వాస్తవ పరిస్థితి మాత్రం వేరేగా ఉంది. భారీ వర్షాలతో చెరువులు పూర్తిగా నిండడంతో పనులు చేసే పరిస్థితి లేదు. మరోవైపు మిషన్ కాకతీయ కార్యక్రమానికి నిధుల సమస్య సైతం ఉంది. 2015–16లో చేపట్టిన మొదటి దశ పనులకు పూర్తిగా బిల్లులు చెల్లించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన రెండో దశ పూర్తయి బిల్లులు ఆన్ లైన్ చేసినప్పటికీ చెల్లింపులు జరగడం లేదు. చెరువుల్లో నిండా నీళ్లు ఉండడంతో పాటు ఇప్పుడు నిధుల కొరత కూడా ఉండడంతో మార్చి తర్వాతే మిషన్ కాకతీయ మూడో దశ పనుల ప్రక్రియ మొదలయ్యే పరిస్థితి ఉందని సాగునీటి శాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిషన్ కాకతీయ ప్రణాళిక... దశ చెరువులు మొదటి దశ 1070 రెండో దశ 1258 మూడో దశ 1367 -
నామమాత్రంగా ‘మిషన్’ పనులు
దెబ్బతిన్న చెరువు కట్టలు లీకేజీలతో వృథాగా పోతున్న నీరు భారీ వర్షాలతో బట్టబయలు భీమారం : మిషన్ కాకతీయ కింద చెరువు పనులను కాంట్రాక్టర్లు నామమాత్రంగా చేస్తున్నారు. మెుదటి విడతలో ఇలా చేసిన పనులకు బిల్లులు డ్రా చేసుకున్నారు. రెండో విడతలోనూ ఇలాగే చేసి బిల్లులు పొందాలనుకునే సమయంలో ఈ పనుల్లో అవినీతి భారీ వర్షాలతో బట్టబయలైం ది. హసన్పర్తి మండలంలో మిషన్ కాకతీయ కింద మెుదటి విడతలో 20 చెరువులు, రెండో దశలో 10 చెరువులను ఎంపికయ్యాయి. ఇందు లో కొన్ని చెరువుల పునరుద్ధరణ పనులు నామమాత్రంగా చేయగా, మరికొన్నింటి పనులు అసలే చేపట్టలేదు. అయినా కాంట్రాక్టర్లు బిల్లు లు పొందారు. ఇందుకు అధికారులు పూర్తిగా సహకరించారు. భారీ వర్షాలు కురవగా ఈ అవి నీతి బహిర్గతమైంది. ప్రస్తుతం కొన్ని చెరువుల కట్టలకు బుంగలు పడగా, మరికొన్ని చెరువుల తూములు లీకయ్యాయి. కాంట్రాక్టర్లు మెురం పోసి క్యూరింగ్, రోలింగ్ సరిగా చేయకపోవడంతో దెబ్బతిన్నాయి. మెుదటి విడతలో మెు రం పోసి ఎలాంటి రోలింగ్ చేయకపోవడంతో హసన్పర్తి, సీతంపేట, వంగపహాడ్, దేవన్నపేట (పడమర చెరువు), ముచ్చర్ల (భీమునికుంట) చెరువుల కట్టలు దెబ్బతిన్నాయి. ముచ్చర్ల (భీమునికుంట) చెరువు నిర్మాణానికి రూ. 44.82లక్షలు ప్రతిపాదించగా, 34.55లక్షలకు అగ్రిమెంట్ జరిగింది. కట్ట నిర్మాణానికి రూ.6.34లక్షలు బిల్లు చెల్లిం చారు. తూము నిర్మాణానికి రూ.2.76లక్ష లు కేటాయించగా ఎలాంటి పనులు చే యలేదు. తూముకు షెట్టర్లు కూడా ఏర్పా టు చేయకపోవడంతో నీరు వృథా పోతోం ది. రైతులు నీటి లీకేజీని అరికట్టే ప్రయత్నం చేశారు. కట్టకు సరైన క్యూరింగ్, రోలింగ్ చేయకపోవడంతో కిందికి కుంగి పగుళ్లు ఏర్పడ్డాయి. దేవన్నపేట పడమటి చెరువు కట్ట నిర్మాణ పనులు అయ్యిందన్నట్లుగా చేసినా రూ. 5.49లక్షలు బిల్లులు చెల్లించారు. మరో భారీ వర్షం కురిస్తే ఈ చెరువు కట్ట తెగే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హసన్పర్తి పెద్ద చెరువు మత్తడి ప్రాంతంలోని తూము లీకై నీరు వృథాగా పోతోంది. స్థానికులు ఇసుక బస్తాలు అడ్డుగా వేశారు. చెరువు వద్ద ఏర్పాటు చేసిన మెట్ల కింది భాగంలో నీటి తాకిడికి కంకర తేలింది. చెరువు కట్ట నిర్మాణానికి రూ.17.63లక్షలు కేటాయించారు. రెండో విడత పనులు మరీ అధ్వానం రెండో విడత మిషన్ కాకతీయ పనులు మరీ అధ్వానంగా మారాయి. ముచ్చర్లలోని ఉరచెరువు కట్ట వర్షానికి దెబ్బతిన్నది. ఈచెరువు అభివృద్ధికి రూ.72లక్షలు కేటాయించగా, కట్ట నిర్మాణానికి సుమారు రూ.15.95లక్షలు ఖర్చు చేశారు. కోమటిపల్లి చెరువు కట్టకు సరైన రోలింగ్ చేయకపోవడంతో పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ చెరువు అభివృద్ధికి రూ.25లక్షలు మంజూరయ్యాయి. కాగా ఈ పనుల్లో జరిగిన అవినీతిపై కలెక్టర్ స్పందించి ప్రత్యేక అధికారిని నియమించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement