'తాంబాళాలుగా ఉన్న చెరువులు గంగాళాలు అవుతాయి' | Etela rajender in mission kakatiya works | Sakshi
Sakshi News home page

'తాంబాళాలుగా ఉన్న చెరువులు గంగాళాలు అవుతాయి'

May 22 2016 11:09 AM | Updated on Sep 4 2017 12:41 AM

'తాంబాళాలుగా ఉన్న చెరువులు గంగాళాలు అవుతాయి'

'తాంబాళాలుగా ఉన్న చెరువులు గంగాళాలు అవుతాయి'

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మిషన్ కాకతీయ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు.

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మిషన్ కాకతీయ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఈ పథకంతో తాంబాళాలుగా ఉన్న చెరువులు గంగాళాలుగా రూపాంతరం చెందుతాయని తెలిపారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం దేశరాజుపల్లిలోని నక్కలకుంట చెరువును మిషన్ కాకతీయ పథకంలో భాగంగా పోలీసులు దత్తత తీసుకున్నారు.

అందులోభాగంగా పూడికతీత పనులను మంత్రి ఈటెల ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో చెరువుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. మిషన్ కాకతీయ పథకం తెలంగాణ బతుకులు బాగు చేసే పథకం అని ఆయన అభివర్ణించారు.   సామాజిక సేవలో భాగంగా చెరువులను దత్తత తీసుకుంటున్న పోలీసు శాఖను మంత్రి ఈటెల అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement