తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్ గురువారం నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు.
నిజామాబాద్ : తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్ గురువారం నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. ప్రత్యేక హెలికాప్టర్లో సదాశివనగర్ పాత చెరువు వద్దకు చేరుకున్నఆయన మిషన్ కాకతీయ పైలాన్ ఆవిష్కరించారు. రైతులతో కలిసి చెరువు పూడిక తీత పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సభాపతి పద్మాదేవేందర్రెడ్డి, మంత్రులు హరీష్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.