నల్లగొండ
పార్లమెంట్ సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి నిధులను సద్వినియోగపరచి ప్రజల సామూహిక అవసరాలకు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్రెడ్డి, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్రెడ్డి కోరారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలోను, జిల్లా కలెక్టర్ చాంబర్లో ఇన్చార్జి కలెక్టర్ సత్యనారాయణతో కలిసి వేర్వేరుగా వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో మంజూరు పనులు, వాటి ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలు విధిగా పాటిస్తూ మంజూరైన పనులకు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని ఎగ్జిక్యూటివ్ ఏజన్సీలను ఆయన కోరారు.
2013-14 సంవత్సరానికి సంబంధించిన పనులు కూడా కొన్ని ప్రారంభించకపోవడం, మరికొన్ని ఇంకా పూర్తి చేయకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ప్రారంభించని పనులు 10 రోజుల్లో ప్రారంభించాలని లేకుంటే రద్దు చేయడానికి ప్రతిపాదించాలని కోరారు. పూర్తిచేసిన ప్రతి పని దగ్గర పార్లమెంట్ సభ్యుల నిధుల నుంచి పూర్తి చేసినట్లు తెలిపే శిలాఫలకాలు విధిగా ఏర్పాటు చేయాలని ఇంజనీర్లను కోరారు. ఈ విషయములో ప్రభుత్వ మార్గదర్శకాలు ఇప్పటికీ అధికారులు పాటిం చకపోవడం విచాకరమన్నారు. రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ పనులు పూర్తి అయి ఆరు నెలలు గడిచినా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు పనుల ఎంబీ పూర్తి చేయనందున బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందన్నారు.
రాజ్యసభ సభ్యుడి నిధుల నుంచి చౌటుప్పల్ ఆస్పత్రికి ఇచ్చిన అంబులెన్సును రోగుల కోసం వినియోగించకుండా డాక్టర్లు సొంత పనులకు వాడుకుంటున్నారనిఈ విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి దృష్టికి తెచ్చినా ఫలితం కనిపించలేదని ఆయన ఇన్చార్జి కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇన్చార్జి కలెక్టర్ సత్యనారాయణ వెంటనే స్పందిస్తూ ఈ విషయంలో అంబులెన్స్ లాగ్ బుక్ సమర్పించాలని, విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిని టెలిఫోన్లో ఆదేశించారు. నారాయణపురం మండలంలో పూర్తి చేసిన పనులకు సంబంధించి 24గంటల లోగా ఎంబీ రికార్డు చేసి చెల్లింపులు జరపాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో రవి, సీపీఓ నాగేశ్వర్రావు, వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పనులు పూర్తిచేయకపోవడం బాధాకరం
Published Fri, Jul 17 2015 1:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబు కోసం ఇంతలా దిగజారాలా పీవీ రమేష్..?
ఐసీసీ అవార్డు రేసులో పాకిస్తాన్ స్టార్ బౌలర్..
కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
తండ్రికి విషెస్ చెప్పిన సీతారామం హీరో.. పోస్ట్ వైరల్!
హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement