నలుగుర్ని అపహరించిన మావోయిస్టులు | Maoists abduct four ribal men | Sakshi
Sakshi News home page

నలుగుర్ని అపహరించిన మావోయిస్టులు

Oct 6 2015 6:59 PM | Updated on Oct 9 2018 2:51 PM

ఖమ్మం జిల్లాలో నలుగురు గిరిజనుల్ని మావోయిస్టులు అపహరించుకుపోయారు.

ఖమ్మం జిల్లాలో నలుగురు గిరిజనుల్ని మావోయిస్టులు అపహరించుకుపోయారు. చర్ల మండలం పెద్దమిడిసిలేరు పంచాయతీ పరిధిలోని చలమల గ్రామానికి చెందిన మడకం ముత్తయ్య, మడకం రాజశేఖర్, మడకం రమేష్, వాసం కన్నారావులను సాయుధులైన మావోయిస్టులు సోమవారం రాత్రి అపహరించుకు పోయినట్టు తెలిసింది.

ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని గ్రామస్తులను మావోయిస్టులు హెచ్చరించినట్టు సమాచారం. ఈ ఘటనని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement