విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి | Man dies due to Electrocution | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

Jul 6 2015 8:28 PM | Updated on Aug 29 2018 4:16 PM

విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలంలోని చౌదర్‌పల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.

బొమ్మలరామారం (నల్లగొండ) : విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలంలోని చౌదర్‌పల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన బోగిరంపేట జైపాల్‌రెడ్డి సోమవారం ఉదయం గ్రామ సమీపంలో బహిర్భూమికి వెళ్లాడు. అయితే పక్కనే గల ట్రాన్స్‌ఫార్మర్ తీగ తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement