అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య | man died with financial crises in adilabad distiricft | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

Feb 10 2015 11:05 AM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా కుంతాల మండలం అందాకూర్ గ్రామంలో మంగళవారం అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కుంతాల మండలం అందాకూర్ గ్రామంలో మంగళవారం అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్తానికంగా ఉండే వామన్‌పల్లి ముత్యం(28) అనే వ్యక్తి ఊరి బయట ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తట్టుకోలేకే  ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.

స్థానికుల సమాచారం అందించడంతో కుంతాల పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్య చేసి చెట్టుకు ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(కుంతాల)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement