ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆ గ్రామానికి చెందిన సంతోష్ (32) అనే వ్యక్తి గురువారం తెల్లవారుజామున తీవ్ర గాయాలతో మృతిచెందాడు. ఈ హత్య వెనక మంత్రాల నెపంతో అతణ్ని కొట్టి చంపి ఉంటారనే వాదన బలంగా వినిపిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.