గొడుగు కింద పాఠాలు!
ధారూరు : మండలం నాగారం పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ భవనం ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పాఠశాల పైకప్పు ఉరుస్తుంది. దీంతో విద్యార్థులు నిత్యం గొడుగుల కింద కూర్చొని పాఠాలు వింటున్నారు. యంత్రాంగం వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.