పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. | Left Couple burnt Case | Sakshi
Sakshi News home page

పెట్రోల్ పోసి నిప్పంటించాడు..

Jun 14 2015 12:58 AM | Updated on Jul 10 2019 7:55 PM

పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. - Sakshi

పెట్రోల్ పోసి నిప్పంటించాడు..

దంపతుల సజీవదహనం కేసు మిస్టరీని హుమయూన్‌నగర్ పోలీసులు ఛేదించారు...

- వీడిన దంపతుల సజీవదహనం కేసు మిస్టరీ
- నిందితుడి రిమాండ్
మెహిదీపట్నం:
దంపతుల సజీవదహనం కేసు మిస్టరీని హుమయూన్‌నగర్ పోలీసులు ఛేదించారు. గోపామహల్ ఏసీపీ కొలనుపాక రాంభూపాల్‌రావు, ఇన్‌స్పెక్టర్ రవిందర్ శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసినా మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్నూలుకు చెందిన షేక్‌హుస్సేన్(49) మెహిదిపట్నంలోని ఖాదర్‌పాషా వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మహబూబ్‌నగర్‌జిల్లా కొల్లాపూర్‌కు చెందిన సుల్తానాబేగం(30) భర్త చనిపోవడంతో కూతురు(14)తో కలిసి ఉంటుంది.

అదే ప్రాంతానికి చెందిన కుర్మయ్యకు(35)కు సుల్తానాతో పరిచయం ఏర్పడింది. వారిద్దరు కలిసి నగరానికి వచ్చి సహజీవనం చేస్తున్నారు. కాగా కుర్మయ్య, సుల్తానాను నగరంలోనే ఉంచి కొల్లాపూర్‌కు వెళ్లాడు. ఆ సమయంలో సుల్తానాకు షేక్‌హుస్సేన్‌తో పరిచయం ఏర్పడింది. ఆమెకు మాయమాటలు చెప్పి పటాన్‌చెరువుకు గతేడాది సెప్టెంబర్‌లో తీసుకువెళ్లి అక్కడే కలిసి ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో సుల్తానా మెహిదిపట్నానికి వచ్చి కూతురుతో ఉంటుంది. మళ్లీ కుర్మయ్య మహబూబ్‌నగర్ నుంచి రావడంతో సుల్తానా అతడితో కలిసి మల్లేపల్లిలో ఖాదర్‌పాషా నిర్మిస్తున్న భవనంలో కూలీ చేసూత అక్కడే ఉంటున్నారు.

ఇది తెలుసుకున్న హుస్సేన్ సుల్తానా వద్దకు వచ్చి వేధిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకుని ఖాదర్‌పాషా హుస్సేన్‌ను పని నుంచి తొలగించాడు. ఇది మనసులో పెట్టుకున్న హుస్సేన్ ఎలాగైనా సుల్తానా, కుర్మయ్యలను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 3న అర్ధరాత్రి 10 లీటర్ల పెట్రోల్ తీసుకువచ్చి కుర్మయ్య, సుల్తానా ఉండే గుడిసె వద్దకు వెళ్లి వారిపై పోసి నిప్పంటించి పరారయ్యాడు. పోలీసులు హుస్సేన్‌పై అనుమానంతో నిఘా పెట్టి శనివారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దంపతులను సజీవదహనం చేసింది తానేనని ఒప్పుకున్నాడు. నిందితుడ్ని రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement