వేగంగా ఎయిమ్స్‌ ప్రక్రియ: లక్ష్మారెడ్డి 

Laxma Reddy Said That AIIMS In Telangana Will Begin Soon - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రానికి మంజూరైన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతోందని వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంతర సంప్రదింపులతో కేంద్ర ప్రభుత్వ అధికారులు త్వరితగతిన స్పందిస్తున్నారని చెప్పారు. అనుకున్న సమయానికి కంటే ముందుగానే కేంద్ర బృందం గురువారం రాష్ట్రానికి వచ్చిందని, బీబీనగర్‌లోని ప్రతిపాదిత ఎయిమ్స్‌ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిందని తెలిపారు. వీలైనంత త్వరగా ఎయిమ్స్‌ నిర్మాణం పూర్తవుతుందన్నారు.   
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top