ఆంధ్ర యువకుడి పనికి కేటీఆర్‌ ఫిదా | KTR Says Special Thanks To AP Youngster | Sakshi
Sakshi News home page

Oct 8 2018 1:34 PM | Updated on Oct 22 2018 6:13 PM

KTR Says Special Thanks To AP Youngster - Sakshi

కేటీఆర్‌, రోహిత్‌ రెడ్డి

కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని ఓ ఆంధ్ర యువకుడు పాదయాత్ర చేపట్టిన..

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో మరోసారి టీఆర్‌ఎస్‌ పార్టీయే అధికారం చేపట్టాలని, కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని రోహిత్‌ కుమార్‌ రెడ్డి అనే  ఆంధ్ర యువకుడు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ యువకుడు చేసిన పనికి మంత్రి కేటీఆర్‌ ఫిదా అయ్యారు. ట్వీటర్‌ వేదికగా అతనికి ధన్యవాదాలు తెలిపారు. ‘రోహిత్‌ రెడ్డి నీ ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. ఏపీకి చెందిన రోహిత్‌.. కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌కు మద్దతుగా విజయవాడ నుంచి పాదయాత్ర  చేస్తున్నారు’ అని ట్వీట్‌ చేశారు.

అయితే రోహిత్‌ రెడ్డి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌కు మద్దతుగా మాట్లాడిన వీడియోను శ్రీనివాస్‌ నారయణ్‌ అనే నెటిజన్‌ ట్వీట్‌ చేయగా దాన్ని  కేటీఆర్‌ రీట్వీట్‌ చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement