'కేసీఆర్‌ వెనక్కి తగ్గడంపై రైతుల్లో ఆందోళన' | KCR don't back on farm loan waiver, says K Jana Reddy | Sakshi
Sakshi News home page

'కేసీఆర్‌ వెనక్కి తగ్గడంపై రైతుల్లో ఆందోళన'

Jun 5 2014 1:49 PM | Updated on Jun 4 2019 5:04 PM

'కేసీఆర్‌ వెనక్కి తగ్గడంపై రైతుల్లో ఆందోళన' - Sakshi

'కేసీఆర్‌ వెనక్కి తగ్గడంపై రైతుల్లో ఆందోళన'

రైతుల రుణమాఫీకి టీఆర్‌ఎస్‌ కట్టుబడి ఉండాలని తెలంగాణ సీఎల్పీ నేత కె జానారెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్: రైతుల రుణమాఫీకి టీఆర్‌ఎస్‌ కట్టుబడి ఉండాలని తెలంగాణ సీఎల్పీ నేత కె జానారెడ్డి డిమాండ్ చేశారు. లక్ష రూపాయల లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామన్న కేసీఆర్‌ ఇప్పుడు వెనక్కి తగ్గడంపై రైతుల్లో ఆందోళన నెలకొందని అన్నారు. రైతుల నమ్మకాన్ని వమ్ము చేయడం, ఇచ్చిన మాటను తప్పడం విశ్వాసఘాతుకమేనని అన్నారు.

ఒక ఏడాది పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తామన్న నిర్ణయాన్ని కేసీఆర్‌ సర్కార్‌ పునరాలోచించాలని సూచించారు. గతేడాది పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని నిన్న జరిగిన బ్యాంకర్ల సమావేశంలో కేసీఆర్ స్పష్టం చేసినట్టు వార్తలు వచ్చాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement