అధికారంలోకి ఎవరొచ్చినా అంతే! | jalagam Venkat Rao comments on telangana govt growth infront bhatti | Sakshi
Sakshi News home page

అధికారంలోకి ఎవరొచ్చినా అంతే!

Mar 18 2017 3:55 AM | Updated on Sep 5 2017 6:21 AM

అధికారంలోకి ఎవరొచ్చినా అంతే!

అధికారంలోకి ఎవరొచ్చినా అంతే!

అధికారంలో ఎవరున్నా ఏదో చేసినట్టు కనిపించడమే తప్ప ఆచరణకు వచ్చేసరికి పరిస్థితిలో తేడా ఏమీ ఉండదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు వ్యాఖ్యానించారు.

భట్టి విక్రమార్కతో జలగం సరదా వ్యాఖ్య  
సాక్షి, హైదరాబాద్‌:  అధికారంలో ఎవరున్నా ఏదో చేసినట్టు కనిపించడమే తప్ప ఆచరణకు వచ్చేసరికి పరిస్థితిలో తేడా ఏమీ ఉండదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు వ్యాఖ్యానించారు. శుక్రవారం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క,, జలగం వెంకట్రావు అసెంబ్లీ లాబీల్లో ఖమ్మం జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలపై చర్చిస్తూ కనిపించారు. దీనితో ఆసక్తిగా వెళ్లిన విలేకరులు ‘ఎవరు, ఎవరిని ప్రభావితం చేస్తున్నారో చూద్దామని వచ్చాము’అని అన్నారు.

దీనికి భట్టి స్పందిస్తూ ‘ప్రపంచంలో ఎన్ని కమ్యూనిస్టు పార్టీలు ఉన్నా అన్నింటికీ మూలం మార్క్స్‌. అలాగే ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు, ఏ పార్టీలో ఉన్నా అన్నింటికీ మూలబిందువు కాంగ్రెస్‌పార్టీయే. ఇందులో ఎవరికైనా అనుమానం ఉండాల్సిన అవసరంలేదు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై వెంకట్రావు స్పందిస్తూ ‘అధికారంలో ఎవరున్నా చేసినట్టు కనిపించడానికి అలా పైపైన రుద్దడం తప్ప ఆచరణలో పెద్ద మార్పులేమీ ఉండవు’ అంటూ సభలోకి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement