పూర్తికాని ఓటరు కార్డు, ఆధార్ అనుసంధానం
రంగారెడ్డి, హైదరాబాద్లో 40 శాతం దాటని వైనం
మిగతా ఎనిమిది జిల్లాల్లో 90 శాతానికిపైగా సీడింగ్
రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో బోగస్ ఓటర్లకు చెక్ పెడుతూ.. ఓటరు జాబితాలో అక్రమాలకు కళ్ళెం వేయాలనే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఓటరు కార్డు వివరాలను ఆధార్తో అనుసంధానం(సీడింగ్) చేసే ప్రక్రియను ప్రారంభించింది. అయితే రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లున్న రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతుండడంతో రాష్ట్ర లక్ష్యం నీరుగారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 2,81,52,182 మంది ఓటర్లుండగా.. ఇప్పటివరకూ 2,13,04,942 ఓటరు కార్డులు మాత్రమే ఆధార్తో అనుసంధానమయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో 75.67 శాతం సీడింగ్ పూర్తయింది.
రెండు జిల్లాల్లోనే వెనుకబాటు..
రాష్ట్రంలోని మొత్తం పది జిల్లాలకుగానూ ఎనిమిది జిల్లాల్లో ఓటర్ కార్డులు, ఆధార్ వివరాల అనుసంధాన ప్రక్రియ 90 శాతానికి పైగా పూర్తయింది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 99.98 శాతం ప్రక్రియ పూర్తయింది. ఆ తర్వాత స్థానాల్లో కరీంనగర్ (99.94%), మహబూబ్నగర్(99.86%) జిల్లాలున్నాయి. నిజామాబాద్, నల్లగొండ, మెదక్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 90 శాతానికి పైగా సీడింగ్ పూర్తయింది. కానీ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మాత్రం ఈ ప్రక్రియ 40 శాతం దాటలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భూక్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిశీలనకు దిగిన రెవెన్యూ యంత్రాంగం దాదాపు ఆరు నెలలుగా కుస్తీపడుతున్నా ఇప్పటికీ క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన పూర్తికాలేదు.
ఈ క్రతువులో అధికారులు బిజీగా ఉండడంతో ఎపిక్, ఆధార్ సీడింగ్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. వచ్చే నెలలో పట్టాల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీంతో సీడింగ్ ప్రక్రియ అటకెక్కినట్లైంది. ఫలితంగా క్రమబద్ధీకరణ పూర్తయ్యే వరకూ సీడింగ్ ప్రక్రియ నెమ్మదిగానే సాగుతుందని ఓ అధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు.
‘జంట’ జిల్లాలతో తంటా
Published Tue, May 19 2015 2:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement