‘గ్రూప్-2’పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు | Sakshi
Sakshi News home page

‘గ్రూప్-2’పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Published Wed, Feb 28 2018 1:46 PM

High court  Interim orders on Group 2 Recruitment - Sakshi

సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 ఉద్యోగ నియామకాలపై ఉమ్మడి హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఓఎంఆర్‌ను రెండుసార్లు దిద్దినట్లు కనిపించినా, వైట్‌నర్ వాడినట్లు గుర్తించినా ఆ ఓఎంఆర్‌లను పరిశీలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓఎంఆర్ అన్సర్ షీట్ల పరిశీలనకు ముగ్గురు న్యాయవాదులను నియమించాలని సూచించింది. శని, ఆదివారాల్లో ఓఎంఆర్ ఆన్సర్ షీట్ల పరిశీలన జరుగుతుందని హైకోర్టు పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 19కి వాయిదా పడింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement