
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు రాష్ట్ర వ్యాప్తంగా అభినందనలు వెల్లువత్తున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలపగా, తాజాగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ట్విటర్లో అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా కేటీఆర్ను అభినందించారు. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టిసారించేందుకు కేటీఆర్కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.