► స్తంభాలు వేసుకుని యథేచ్చగా వినియోగం
► ఆలస్యంగా తేరుకున్న సెస్
► జరిమానాతో సరి..!
వేములవాడ రూరల్ : నిరుపేదలు విద్యుత్ స్తంభాలకు వైర్లు తగిలించి తమ ఇళ్లలో ఒక్క బల్బు వెలిగించుకుంటే కేసులు నమోదు చేసి, వారిని ముప్పు తిప్పలు పెట్టడం సెస్ అధికారులకు పరిపాటి. కానీ ఒక బడా వ్యాపారి తన వ్యాపారానికి కావాల్సిన విద్యుత్ను చోరీ చేసినా, ఎలాంటి అనుమతి లేకుండా ఏకంగా పోల్స్ వేసుకున్నా పట్టించుకోరు! వేలాది రూపాయల విద్యుత్ను అక్రమంగా వినియోగించుకుంటే కేసు నమోదు చేయకుండా కేవలం జరిమానాతో సరిపెట్టడం అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం.
వేములవాడ మండలం సంకెపల్లి గ్రామ శివారులోని ఒక గ్రానైట్ క్వారీ యజమాని తన క్వారీలో ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా విద్యుత్ను అక్రమంగా వినియోగించుకుంటున్నాడు. 12 స్తంభాలను ఏర్పాటు చేసుకుని, దానికి సెస్ విద్యుత్ వైరు కనెక్షన్ కలుపుకుని, 5హెచ్పీ, 7హెచ్పీ మోటార్లు బిగించుకుని విద్యుత్ను వాడుకుంటున్నాడు. చాలాకాలంగా విద్యుత్ అక్రమ వినియోగం కొనసాగుతున్నట్లు ఆరోపణలు వస్తుండగా.. సెల్ అధికారులు ఆలస్యంగా గుర్తించడం అనుమానాలకు తావిస్తోంది. గురువారం సెస్ ఎండీ నాంపల్లిగుట్ట సదరు గ్రానైట్ క్వారీని తనిఖీ చేయడంతో విద్యుత్ అక్రమ వినియోగం వెలుగులోకి వచ్చింది. దీనివెనుక సెస్ అధికారులతోపాటు ఇటీవల సెస్ డెరైక్టర్గా ఎన్నికైన అధికార పార్టీ నాయకుని హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
సెస్ నుంచే స్తంభాలు సరఫరా..?
గ్రానైట్ క్వారీ యజమాని వేసుకున్న 12 విద్యుత్ స్తంభాలు, దానికి సరిపడా విదుత్ వైర్లు సిరిసిల్ల సెస్ నుంచే సరఫరా అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి అదే కార్యాలయంలో పనిచేసే కొంత మంది ఉద్యోగులు, అధికార పార్టీ నాయకులు సహకరించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. సెస్ సిబ్బందే విద్యుత్ స్తంభాలు, వైర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకుగాను వారికి పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరిన్ని విషయూలు బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.
సిబ్బంది మధ్య విభేదాలతో...!
గ్రానైట్ క్వారీకి విద్యుత్ పోల్లను, వైర్లను వేసిన సెస్ సిబ్బంది మధ్య కొన్ని విభేదాలు తలెత్తడంతోనే ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటపడిందని తెలుస్తోంది. గురువారం సెస్ ఎండీ నాంపల్లిగుట్ట క్వారీని పరిశీలించడంతో అక్రమ విద్యుత్ వినియోగం విషయం బయటపడింది. ప్రతి గ్రామానికి ఒకరిద్దరు సెస్ ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ బహిరంగ ప్రదేశంలో జరిగిన ఈ పనులను ఆ ఎందుకు గుర్తించలేదనే అనుమానం రాక మానదు.
అధికార పార్టీ నాయకుడి ఒత్తిడి..?
సెస్ పరిధిలో పనిచేసిన లైన్మెన్లపై ఒక అధికార పార్టీ నాయకుడు ఒత్తిడి తీసుకువచ్చి ఈ గ్రానైట్ క్వారీకి విద్యుత్ పోల్లను, విద్యుత్ వైర్లను వేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మూడింతలు జరిమాన విధిస్తాం -సెస్ ఎండీ నాంపల్లిగుట్ట
గ్రానైట్ క్వారీ యజమాని అక్రమంగా విద్యుత్ను వా డుకుంటున్నట్లు సెస్ ఎండీ నాంపల్లిగుట్ట ధ్రువీకరిం చారు. విద్యుత్ను అక్రమంగా వాడుకుంటుట్లు తెలి యడంతో తాను వెళ్లి పరిశీలించానని చెప్పారు. గత ఆ రు నెలల్లో క్వారీకి వచ్చిన విద్యుత్ బిల్లులపై మూడిం తల జరిమాన విధిస్తామన్నారు. ఈ విషయూన్ని సెస్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. విద్యుత్ పో ల్లు, వైర్ల విషయమై ప్రశ్నించగా... క్వారీ యజమాని బయట నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు చెప్పాడని, ర శీదు మాత్రం చూపించలేదని తెలిపారు.
బ్లాస్టింగ్కు అనుమతులు ఉన్నాయా..?
గ్రానైట్ క్వారీకి బ్లాస్టింగ్ అనుమతులు ఉన్నాయా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా గ్రానైట్ క్వారీ నిర్వహిస్తుండగా, వేల సంఖ్యలో బ్లాస్టింగ్లు చేసినట్లు క్వారీలో చూస్తే తెలుస్తోంది. అనుమతులు లేకుండా విద్యుత్ను వినియోగిస్తున్న నేపథ్యంలో బ్లాస్టింగ్ల అనుమతులు తీసుకున్నారా..? అనేది సందేహమే. ఇప్పటికైనా జిల్లా అధికారులు పూర్తిస్థారుులో విచారణ జరిపి అక్రమాలను అరికట్టాల్సిన అవసరముంది.
గ్రానైట్కు అక్రమ విద్యుత్
Published Fri, Mar 18 2016 3:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement