సలహాదారుల పదవీకాలం ఏడాది పొడిగింపు | government advisers tenure extension after one year | Sakshi
Sakshi News home page

సలహాదారుల పదవీకాలం ఏడాది పొడిగింపు

May 27 2015 7:53 PM | Updated on Sep 3 2017 2:47 AM

ప్రభుత్వ సలహాదారుల పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ తెలంగాణ సర్కారు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారుల పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ తెలంగాణ సర్కారు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆర్.విద్యాసాగర్‌రావు (నీటిపారుదల), ఏకే గోయల్(ప్రణాళిక, ఇంధన), ఏ.రామలక్ష్మణ్ (సంక్షేమం), బి.వి.పాపారావు (విధాన నిర్ణయాలు, సంస్థాగత అభివృద్ధి), కేవీ రమణాచారి (సాంస్కృతిక పర్యాటక, యువజన, మీడియా విభాగాలు), జీఆర్‌రెడ్డి (ఆర్థిక శాఖ) సలహాదారులుగా ఉన్నారు. ఈ ఆరుగురు సలహాదారులు మరో ఏడాది పాటు ఈ పదవిలోనే కొనసాగుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement