బోరుబావి నుంచి క్షేమంగా బయటపడిన బాలిక | girl safely from rescued from borewell in rangareddy district | Sakshi
Sakshi News home page

బోరుబావి నుంచి క్షేమంగా బయటపడిన బాలిక

Jan 13 2015 9:57 PM | Updated on Mar 28 2018 11:05 AM

రంగారెడ్డి జిల్లాలో గండేడు మండలం గోవింద్పల్లి తండాలో బోరుబావిలో పడిన ఆరేళ్ల బాలిక అంజలి క్షేమంగా బయటపడింది.

గండేడు: రంగారెడ్డి జిల్లాలో గండేడు మండలం గోవింద్పల్లి తండాలో బోరుబావిలో పడిన ఆరేళ్ల బాలిక అంజలి క్షేమంగా బయటపడింది. ఆమెను సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీశారు. 108 వాహనంలో ఆమెను ఆస్పత్రికి తరలించారు.

సాయంత్రం 6 గంటల సమయంలో ఆడుకుంటూ చిన్నారి 10 అడుగుల లోతున్న బోరు బావిలో పడిపోయింది. బోరుబావి లోతు తక్కువ ఉండడంతో పాపకు ప్రమాదం తప్పింది. పాప క్షేమంగా బయటపడడంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement