బీజేపీ గిరిజన గర్జన సభను అడ్డుకున్న నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి జిల్లాలో బీజేపీ తలపెట్టిన గిరిజన గర్జన సభ రసాభాసగా మారింది. బీజేపీ సభ జరుగుతుండగా  గిరిజన సంఘం నాయకులు మధ్యలో అడ్డుకోవడంతో ఆందోళన నెలకొంది. 

చ​ర్ల మండల కేంద్రంలో భద్రాద్రినియోజక  వర్గ పరిధిలో బీజేపీ గిరిజన గర్జన బహిరంగ సభను నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని  గిరిజన సంఘం నాయకులు వేదిక వద్ద బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసుల జోక్యంతో ఆందోళనకారులు వెనుదిరిగారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top