మరో వారం ఇబ్బందులు భరించాల్సిందే! | GHMC Commissioner Janardhan Reddy On Hyderabad Rains  | Sakshi
Sakshi News home page

వర్షాలు తగ్గాకే రోడ్లు బాగు చేస్తాం: కమిషనర్‌

Oct 11 2017 4:10 PM | Updated on Oct 11 2017 4:13 PM

GHMC Commissioner Janardhan Reddy On Hyderabad Rains 

నగరంలో వర్షాలపై, రోడ్ల పరిస్థితిపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్థన్‌ రెడ్డి స్పందించారు.

సాక్షి, హైదరాబాద్‌: కొన్ని రోజులుగా నగరంలో ​కురుస్తున్న వర్షాలు, రోడ్ల పరిస్థితిపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్థన్‌ రెడ్డి స్పందించారు. వర్షాలు‌ తగ్గిన తరువాతనే రోడ్లు బాగు చేస్తామన్నారు. ఈ నెల 15 వరకూ‌ భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలిపారు. ఆయనిక్కడ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి రోడ్డునూ‌ రీ కార్పెటింగ్ చేస్తామని వెల్లడించారు.

200 కి. మీ మేర రోడ్ కార్పోరేషన్ ద్వారా సిమెంట్ రోడ్లను వేయాలని నిర్ణయించామన్నారు. మరో వారం రోజుల‌ పాటు ‌ఇబ్బందిని సిటీ వాసులు భరించాలని చెప్పారు. రామంతాపూర్ లో నీళ్లను‌ పంపింగ్ చేయడానికి రెండు రోజులు పడుతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement