నాకు ప్రాణహాని ఉంది... కాపాడండి: గద్దర్
సాక్షి, హైదరాబాద్: తనపై కాల్పులు జరిగి 20 ఏళ్లు గడుస్తున్నా, విచారణ ఇంకా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందని ప్రజా గాయకుడు గద్దర్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సచివాలయంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలసి ప్రాణాలకు హాని ఉందని గద్దర్ వాపోయారు. కాల్పుల ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై రాష్ట్రపతి, ప్రధానికి గతంలోనే లేఖలు రాశానని గుర్తు చేశారు. దీనిపై రాష్ట్రపతి సైతం విచారణకు ఆదేశిస్తూ రాసిన లేఖ ప్రతులను మంత్రికి అందించారు.