
నేటి నుంచి జిల్లాలో ఎంపీ పొంగులేటి పర్యటన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఖమ్మం...
ఖమ్మం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీని వాసరెడ్డి రెండు రోజు లపాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జూలూరుపాడులో ఓ పెళ్లి వేడుకలో పొంగులేటి పాల్గొంటారు.
అనంతరం సత్తుపల్లి కళాభారతి ఆడిటోరియంలో జరిగే డ్యాన్స్ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఆదివారం ఉద యం 10.30 గంటలకు కొత్తగూడెంలో ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పాల్వంచలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. 3 గంటలకు కొత్తగూడెంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 4గంటల నుంచి కొత్తగూడెంలోని పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.