అర్హులందరికీ ‘ఆహారభద్రత’ | Food security cards for everyone | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ‘ఆహారభద్రత’

Jan 21 2015 1:55 AM | Updated on Sep 2 2017 7:59 PM

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఆహారభద్రత కార్డులు మంజూరు చేస్తామని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ అన్నారు.

రాంగనర్ : అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఆహారభద్రత కార్డులు మంజూరు చేస్తామని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. మంగళవారం నిర్వహించిన జేసీ ఫోన్ ఇన్ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేశారు. మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, కోదాడ, హాలియ, త్రిపురారం, దేవరకొండ, నకిరేకల్, మోత్కూర్ తదితర ప్రాం తాల నుంచి ఫోన్ చేసిన పలువురు.. ఆహారభద్రత కార్డుల మంజూరులో కింది స్థాయి అధికారులు పట్టించుకోవడంలేదని జేసీ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం జేసీ మాట్లాడుతూ ఆహారభద్రత కార్డులు రాలేదని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని, అర్హత ఉంటే తప్పనిసరిగా ఇస్తామన్నారు. జాబితాలో పేరు వచ్చిన వారికి రేషన్ సరుకులు అందిస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయి అధికారులు, సిబ్బంది ఎలాంటి అవాంతరాలు కలుగజేయకుండా దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారభద్రత కార్డులు ఇవ్వదన్నారు.   ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఓ వెంకటేశ్వర్లు, ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement