తండ్రి మందలించాడని | Father reproach person sucide | Sakshi
Sakshi News home page

తండ్రి మందలించాడని

Mar 6 2017 1:08 PM | Updated on Aug 16 2018 4:30 PM

ఆత్మహత్యలకు కారణాలు కనపడటం లేదు తండ్రి మందలించాడనే కారణంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కొండపాక(సిద్ధిపేట): ఆత్మహత్యలకు కారణాలు కనపడటం లేదు తండ్రి మందలించాడనే కారణంతో  మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిద్ధిపేట జిల్లా కొండపాక తిప్పారం గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఆంజనేయులు(35) వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
 
 ఈ క్రమంలో గ్రామంలోని కొందరికి డబ్బు అప్పుగా ఇచ్చాడు. ఈ విషయం తెలిసిన ఆంజనేయులు తండ్రి అతన్ని మందలించడంతో.. మనస్తాపానికి గురై చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement