తండ్రి మందలించాడని | Sakshi
Sakshi News home page

తండ్రి మందలించాడని

Published Mon, Mar 6 2017 1:08 PM

Father reproach person sucide

కొండపాక(సిద్ధిపేట): ఆత్మహత్యలకు కారణాలు కనపడటం లేదు తండ్రి మందలించాడనే కారణంతో  మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిద్ధిపేట జిల్లా కొండపాక తిప్పారం గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఆంజనేయులు(35) వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
 
 ఈ క్రమంలో గ్రామంలోని కొందరికి డబ్బు అప్పుగా ఇచ్చాడు. ఈ విషయం తెలిసిన ఆంజనేయులు తండ్రి అతన్ని మందలించడంతో.. మనస్తాపానికి గురై చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement