బాల్కొండ మండలం నాగ్పూర్ గ్రామానికి చెందిన రైతులు మంగళవారం నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు.
నిజామాబాద్ : బాల్కొండ మండలం నాగ్పూర్ గ్రామానికి చెందిన రైతులు మంగళవారం నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. గ్రామంలో కబ్జాకు గురైన పశువుల మంద భూమిని వెలికి తీయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ ధర్నాలో సుమారు 200 మంది గ్రామస్తులు పాల్గొన్నారు.
కాగా అదే సమయంలో ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపాలని కోరుతూ జక్రాన్ పల్లి మండలం పడకల్ గ్రామస్తులు కూడా కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు.