బోరు మోటర్ను బయటకు లాగుతుండగా ప్రమాదవశాత్తు ముగ్గురు రైతులు విద్యుదాఘాతానికి గురయ్యారు.
మొయినాబాద్ (రంగారెడ్డి జిల్లా) : బోరు మోటర్ను బయటకు లాగుతుండగా ప్రమాదవశాత్తు ముగ్గురు రైతులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బారపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బారపల్లి గ్రామానికి చెందిన బుర్ర హనుమంతు, అశోక్, విజయ్లు ముగ్గురు బోరు మోటర్ తీసేందుకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు ముగ్గురు విద్యుదాఘాతానికి గురయ్యారు. వీరిని వెంటనే 108లో ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుతానికి వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.