అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | farmer suicide in karim nagar | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Sep 2 2015 11:15 AM | Updated on Oct 1 2018 2:36 PM

కుమార్తె పెళ్లికి చేసిన అప్పు తీర్చలేననే బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడో రైతు.

కరీంనగర్: కుమార్తె పెళ్లికి చేసిన అప్పు తీర్చలేననే బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడో రైతు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కోరండ్ల గ్రామంలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ముస్కు నాగిరెడ్డి(47)కి మూడున్నర ఎకరాల భూమి ఉంది.

అందులో ఎకరం మేరా వరి వేసి మిగతా కూరగాయల సాగు చేస్తున్నాడు. వర్షాలు లేక వేసిన పొలం ఎండిపోతుండటంతో, గతేడాది కూతురు పెళ్లికి చేసిన అప్పు తీర్చే దారి కానరాక మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement